Reading Time: < 1 minute
Wife Dies By Suicide After Husbands Death In Karimnagar Tragic Incident In Mamidalapalli

Mamidalapalli: భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ భార్య. వృద్దాప్యంలో అనారోగ్యం పాలైన భర్తకు గత మూడు సంవత్సరాలుగా సేవలు చేస్తూ చివరికి భర్త మృతి చెందడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్‌.. ఓటీటీలో సరికొత్త రికార్డు..!

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య, పద్మలకు ఒక కొడుకు, ఓ కూతురు ఉన్నారు. వీరిద్దరికి వివాహమై వెళ్ళిపోవడంతో ఇద్దరు దంపతులు గ్రామంలో ఉంటున్నారు. గత కొంత కాలంగా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నేడు భర్త శంకరయ్య మృతి చెందడంతో భర్త మరణం తట్టుకోలేక.. భార్య పద్మ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య భర్తలు మృతి చెంది ఉన్న విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారిస్తున్నారు.

BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్‌’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!