Reading Time: < 1 minute
India Vs New Zealand T20 World Cup Final Sets Record On Jiohotstar With 78 5 Crore Views

JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ లో భారీ రికార్డు సృష్టించింది. ఆదివారం జియో హాట్‌ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సమయంలో వ్యూస్ సంఖ్య రికార్డ్ స్థాయికి చేరుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో వ్యూస్ దాదాపు 78.5 కోట్లకు చేరుకుని సరికొత్త మైలురాయిని నమోదు చేసింది. న్యూజిలాండ్ టీమిండియా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలోనే జియో హాట్‌ స్టార్‌ లో వ్యూస్ సంఖ్య సుమారు 58.3 కోట్లుగా నమోదైంది. ఆ తర్వాత మ్యాచ్ క్రమంగా ఉత్కంఠభరితంగా మారడంతో వీక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్

ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ ఔటైన సమయంలో భారీ స్థాయిలో వ్యూస్ పెరిగాయి. ఆ సమయంలో మొత్తం వ్యూస్ సుమారు 63.2 కోట్లకు చేరాయి. ఆ వికెట్ తర్వాత మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గుచూపడంతో ప్రేక్షకుల నుంచి మరింత ఆసక్తి పెరిగింది. ఇక మ్యాచ్ చివరి క్షణాల్లో వ్యూస్ సంఖ్య భారీగా పెరిగింది. భారత్ విజయం ఖరారయ్యే సమయంలో జియో హాట్‌ స్టార్‌ లో వ్యూస్ దాదాపు 80 కోట్లకు చేరువైంది. భారత్ విజయం ఖాయం చేసిన చివరి క్యాచ్ పట్టిన సమయంలోనే వ్యూస్ సంఖ్య 74.5 కోట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ లో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది.

BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్‌’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!

ఇదిలా ఉండగా.. ఇదే టోర్నీలో ముందుగా జరిగిన భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు కూడా భారీ స్పందన లభించింది. ఐసీసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆ మ్యాచ్‌ను జియోహాట్‌స్టార్‌లో ఒకేసారి సుమారు 6.52 కోట్ల మంది వీక్షించారు. ఈ లెక్కలు భారత్ లో క్రికెట్‌ కు ఉన్న భారీ ప్రజాదరణ ఏ రేంజ్ లో ఉందొ స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా భారత్ ఆడే కీలక మ్యాచ్‌లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రేక్షకుల స్పందన భారీగా పెరుగుతున్నట్లు ఈ రికార్డులు తెలుపుతున్నాయి.