
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఓపెనర్, కేరళ కింగ్ సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన భారత వికెట్ కీపర్గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం వాంఖడేలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ బాదడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. సంజు ఖాతాలో ఇప్పుడు ఆరు శతకాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, భారత్, కేరళ, రాజస్థాన్ రాయల్స్ తరపున సంజు ఆడాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉండగా.. రిషబ్ పంత్ మూడు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.
సంజు శాంసన్ ఇప్పటివరకు వికెట్కీపర్గా 235 టీ20 మ్యాచ్లు ఆడి 6298 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ట్రేడ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి చేరిన సంజు.. ఈ ఏడాది ఇప్పటికే రెండు శతకాలు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది అతనికి ఐదో సెంచరీ కావడం విశేషం. మొత్తంగా వికెట్ కీపర్ బ్యాటర్గా అత్యధిక టీ20 సెంచరీలు చేసిన ఆటగాడిగా క్వింటన్ డి కాక్ ముందంజలో ఉన్నాడు. అతని ఖాతాలో 9 శతకాలు ఉన్నాయి. అయితే భారత ఆటగాళ్లలో మాత్రం సంజు కొత్త బెంచ్మార్క్ సెట్ చేశాడు.
ఐపీఎల్లో కూడా సంజు శాంసన్ తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు 122 ఐపీఎల్ మ్యాచ్ల్లో వికెట్కీపర్గా మూడు సెంచరీలు సాధించాడు. డికాక్ కూడా ఐపీఎల్లో మూడు సెంచరీలు బాదాడు. ఈ గణాంకాలు చూస్తే సంజు ప్రస్తుతం భారత వికెట్కీపర్-బ్యాటర్లలో అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడని చెప్పవచ్చు. ఐపీఎల్ 2026లో సంజు 7 ఇన్నింగ్స్లలో 293 రన్స్ చేశాడు. సగటు 58.6 కాగా.. స్ట్రైక్ రేట్ 178.66గా ఉంది.