
Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిగత సమావేశానికి సంబంధించిన వీడియోను రహస్యంగా రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలతో వైరల్ చేస్తున్నారని కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ చర్యల వల్ల తన ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఈ నెల 16వ తేదీన తన వద్ద ఉన్న ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వంశీ తెలిపారు. అయినప్పటికీ ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Read Also: Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
ఇక, తన రహస్య సమావేశానికి సంబంధించిన సీక్రెట్ వీడియోలు.. యూట్యూబ్, గూగుల్ వంటి డిజిటల్ వేదికల్లో వైరల్ అవుతున్నాయి.. ఆ వీడియోలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు వల్లభనేని వంశీ.. అసత్య ప్రచారంతో కూడిన వీడియోలు మరింతగా వ్యాప్తి చెందితే తన పరువుకు భంగం కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే గన్నవరం ఎస్హెచ్వోను వెంటనే ఆదేశించి, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీని అభ్యర్థించారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. అయితే, ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.