Reading Time: 2 minutes
Tamil Nadu Elections Celebrities Politicians Cast Votes

తమిళనాడులో జోరుగా పోలింగ్ జాతర నడుస్తోంది. ఉదయం నుంచే ఓటర్లు పోటెత్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూలు ఉన్నాయి. ఇక ఓటింగ్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

T45

సినీనటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శృతిహాసన్, విజయ్, త్రిష, ధనుష్, విక్రమ్, ప్రభు, ఖుష్బు, ఇళయరాజా, దర్శకుడు అట్లీ, సీఎం ఎంకే స్టాలిన్‌, పి.చిదంబరం తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

4

తమిళనాడులో అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూలైన్లు ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మరో 2 గంటలు పోలింగ్ పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీవీకే అధినేత విజయ్ కోరారు. ఉదయం 11 గంటలకు 37 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రానికి భారీగా పోలింగ్ నమోదు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.

Tr4

K4