Reading Time: < 1 minute

హైదరాబాద్లో చల్లబడిన వాతావరణం.. సిటీలోని ఈ ఏరియాల్లో వర్షం

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో వాతావరణం మధ్యాహ్నం నుంచి ఉన్నట్టుండి చల్లబడింది. ఎండలు తగ్గి మేఘాలు కమ్ముకున్నాయి. హకీంపేట్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, కూకట్ పల్లి , బాచుపల్లి , సుచిత్ర, నిజాంపేట్, ఆల్వాల్ , మేడ్చల్, శేరి లింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. 

జీడిమెట్ల, దూలపల్లి, బహదూర్ పల్లి, గండిమైసమ్మలో వర్షం మొదలైంది. గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

గద్వాల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈదురుగాలుల కారణంగా అయిజ మండలం మేడికొండ గ్రామానికి చెందిన కుమ్మరి తిమ్మప్ప అనే రైతుకు చెందిన రెండు ఎకరాల అరటి తోట నేలకొరిగింది. వర్షం కారణంగా అయిజ, రాజోలి మండలాల్లో 1,738 ఎకరాల్లో వరిదెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనావేశారు. 

భద్రాద్లి జిల్లా గుండాల మండలంలో బుధవారం మధ్యాహ్నం వర్షం పడడంతో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది. ములుగు జిల్లా మంగపేట, కమలాపురం గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు, వర్షం రావడంతో కమలాపురంలో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి నేల వాలింది. పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్‌‌‌‌ స్తంభాలు విరిగిపడడంతో కరెంట్‌‌‌‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కమలాపురం నుంచి ఏటూరునాగారం రోడ్డుపై చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్‌‌‌‌కు అంతరాయం ఏర్పడింది.

©️ VIL Media Pvt Ltd.