
MLC Jayamangala Venkataramana: ఏపీలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను మండలి చైర్మన్ తిరస్కరించారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జయమంగళ వెంకటరమణ 2024 నవంబర్ 23న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే, తన రాజీనామా ఆమోదం విషయంలో స్పష్టత రాకపోవడంతో అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2025 సెప్టెంబర్ 16న ఈ అంశంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
Read Also: Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ఈ కేసులో మండలి చైర్మన్ తరఫు న్యాయవాదులు కోర్టులో కీలక వాదనలు వినిపించారు. జయమంగళ వెంకటరమణ స్వచ్ఛందంగా కాకుండా, ఎవరో ప్రేరేపించడంతో రాజీనామా చేశారనే అనుమానాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కారణంగానే రాజీనామాను తిరస్కరించినట్లు వెల్లడించారు. మరోవైపు, మండలిలో ప్రతిపక్ష నేత కూడా వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల వెనుక ఏదో కారణం ఉందని చైర్మన్కు లేఖ రాసినట్లు సమాచారం. కొందరి ప్రేరణతోనే రాజీనామాలు జరిగి ఉండొచ్చని పేర్కొంటూ, వాటిపై మరోసారి సమీక్ష చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మండలి చైర్మన్, జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఆమోదించకుండా తిరస్కరించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇకపై ఈ అంశం న్యాయపరంగా, రాజకీయంగా మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.