Reading Time: < 1 minute
South Indian Producers Reject 8 Week Ott Window Rule Telugu Tamil Films

టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల డిజిటల్ విడుదలపై గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. థియేటర్లలో విడుదలైన ఎన్ని రోజులకు సినిమా ఓటీటీలోకి రావాలనే అంశంపై దక్షిణాది సినీ నిర్మాతల అసోసియేషన్ (South Indian Film Producers Association) కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో నిర్మాతలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎగ్జిబిటర్లను (Theater Owners) ఆందోళనకు గురిచేస్తోంది.

సినిమా ధియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల వరకు ఓటీటీ స్ర్టీమింగ్ చేయకూడదని మల్టీప్లెక్స్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. అలా చేస్తేనే ప్రేక్షకుల ధియేటర్లకు వస్తారని వారి వాదన. అయితే తెలుగు, తమిళ నిర్మాతలు మాత్రం దీనికి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. సిరిమా బడ్జెట్లు పెరిగిపోతున్న తరుణంలో, ఓటీటీ డీల్స్ ద్యారా వచ్చే ఆదాయం తమకు భారంగా మాతుందని, అందుకే 4 వారాల గ్యాప్ అయిన ఉండాలని వారు ఖారాకండిగా చెప్పేశారట. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు 4 వారాల తర్వాత ఓటీటీ ఆదాయం చాలా ముఖ్యం. దీని బట్టి చూస్తే సౌత్ ఇండియాలో స్టార్ హీరోల సినిమాలకు మినహా, మిగిలిన చిత్రాలన్నింటికీ ఈ 4 వారాల ఫార్ములానే వర్తించేలా కనిపిస్తోంది. అగ్రిమెంట్లలో నిర్మాతలు ఈ క్లాజ్‌ను కచ్చితంగా పెడుతున్నారట. దీనివల్ల భవిష్యత్తులో సౌత్ సినిమాల డిజిటల్ బిజినెస్ మరింత వేగవంతం కానుంది. అయితే, బాలీవుడ్ (North India) లో మాత్రం ఇప్పటికీ 8 వారాల నిబంధనను కఠినంగా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.