
MI vs CSK: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో ఓ భావోద్వేగ ఘటన అందరినీ కదిలించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి తన తల్లిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ జట్టు కోసం మైదానంలోకి దిగడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ముఖేష్ చౌదరి తల్లి ప్రేమ్ దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు ఏడాది కాలంగా ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఈ విషాద వార్తను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించి, ముఖేష్ కుటుంబానికి సంతాపం తెలిపింది.
Read Also: MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
ఇంతటి వ్యక్తిగత విషాదం మధ్యలోనూ ముఖేష్ చౌదరి జట్టుపై ఉన్న అంకితభావాన్ని చాటారు. తల్లి మరణించినప్పటికీ మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకుని తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ నిర్ణయం ఆయన ధైర్యం, బాధ్యత, వృత్తి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. అయితే, ముఖేష్ తల్లికి నివాళిగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు నల్లటి ఆర్మ్బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చారు. జట్టు మొత్తం ఒకటిగా నిలబడి సహచర ఆటగాడికి అండగా నిలిచిన ఈ దృశ్యం స్టేడియంలో ఉన్న వారిని కదిలించింది.
మ్యాచ్ విషయానికి వస్తే, ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగినా, అందరి దృష్టి మాత్రం ముఖేష్ చౌదరి ధైర్యసాహసాలపైనే నిలిచింది. క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు.. జీవితంలోని కష్టసమయాల్లో కూడా ఆటగాళ్లు ఎలా నిలబడతారో ముఖేష్ చౌదరి మరోసారి నిరూపించారు. వాంఖడేలో చోటుచేసుకున్న ఈ ఘటన ఐపీఎల్ చరిత్రలో చిరస్మరణీయ క్షణంగా నిలిచిపోనుంది.
This one is for Mukesh’s mother.
In her memory and in solidarity with Mukesh, we wear black armbands and play with a little more in our hearts today. pic.twitter.com/OKk6bmPK4e— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2026