Reading Time: < 1 minute
Shivathmika Rajasekhar Comments On Nepotism Social Media Followers Issue

టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ నట వారసురాలిగా ‘దొరసాని’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక రాజశేఖర్. తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక, సినీ పరిశ్రమలో నెపోటిజం, అవకాశాల వెనుక ఉన్న చేదు నిజాలను బయటపెట్టారు.

Also Read : Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..

శివాత్మిక మాట్లాడుతూ..‘రాజశేఖర్ గారి అమ్మాయి అంటే దర్శకుడి దగ్గరకు వెళ్లేందుకు ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది. కానీ, ఆ తర్వాత అవకాశం రావడం అనేది కేవలం నా ప్రతిభ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నెపోటిజం అనేది మొదటి సినిమా వరకే పనికొస్తుంది, ఆ తర్వాత ప్రతి సినిమా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ‘దొరసాని’ వల్ల నాకు ‘రంగమార్తాండ’లో అవకాశం వచ్చిందే తప్ప, నా బ్యాక్‌గ్రౌండ్ వల్ల కాదు. నేను రాజశేఖర్ కూతురిని అని తెలిసి కూడా కొన్ని ప్రాజెక్టుల నుంచి నన్ను తప్పించి మరొకరిని తీసుకున్నారు. దానికి కారణం ఏంటని అడిగితే.. నాకంటే వాళ్లకు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని చెప్పారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ నెంబర్స్ ఆధారంగా నటీనటులను ఎంపిక చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. నేను నటిని, కంటెంట్ క్రియేటర్‌ని కాదు. యాక్టింగ్ వచ్చా? లేదా? ఆ పాత్రకు సూట్ అవుతానా? లేదా? అనేది చూడాలి కానీ ఫాలోవర్లను కాదు’ అని చెప్పుకొచ్చింది.