Reading Time: < 1 minute
IND vs NAM: ఇషాన్, హార్దిక్ అదరగొట్టినా.. మిగతా వాళ్లంతా హ్యాండిచ్చారుగా.. నమీబియా టార్గెట్ 210

India vs Namibia, 18th Match, Group A, ICC Men’s T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా 18వ మ్యాచ్‌లో నమీబియాకు భారత్ 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది.

ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61), సంజు సామ్సన్, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) అర్ధ సెంచరీలు సాధించారు. తిలక్ వర్మ 25, శివమ్ దుబే 23, సంజు సామ్సన్ 22 పరుగులు చేశారు.

నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ 4 వికెట్లు పడగొట్టాడు.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

నమీబియా (ప్లేయింగ్ XI): లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జేజే స్మిట్, జేన్ గ్రీన్(కీపర్), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో.