మటన్ నెరడుకూరకు కావాల్సిన పదార్దాలు : అరకిలో మటన్ నెరడు , రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మూడు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, మూడు టేబుల్ స్పూన్స్ నూనె , నాలుగు కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.
ముందుగా మటన్ నెరడును ఇలా ఉడికించాలి: కుక్కర్ తీసుకుని మటన్ నెరడు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, ఒక గ్లాస్ నీళ్లు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీదే బాగా ఉడికించాలి. ఇలా చేస్తే తినడానికి కూడా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పాత రోజుల్లో బాగా చేసుకుని తినేవాళ్ళు. మీరు కూడా ఈ ఆదివారం తినండి.
మసాలాలు వేసి ఈ విధంగా ఉడికించాలి: ఒక పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, కరివేపాకు, నాలుగు పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయలు గోల్డ్ రంగులోకి మారే వరకు వాటిని వేయించాలి. అలాగే, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు టమోటాల , ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
బాలింతలకు ఈ కూర ఓ వరం: డెలివరీ తర్వాత బాలింతలు ఈ మటన్ నెరడుకూర తింటే వెంటనే పాలు పడతాయి. ఇంకా వారిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి. ఇంకా జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. అంతే, గ్యాస్, ఎసిడిటీ కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
కానీ, బాలింతలు ఈ కూరను తినేటప్పుడు వైద్యున్ని సంప్రదించి తినాలి. ఎందుకంటే, ఇది తిన్న తర్వాత కొందరికి పడదు. కాబట్టి, తినే టప్పుడు జాగ్రత్త. ఇక తినే వాళ్లు వారంలో ఒకసారి తింటే సరిపోతుంది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)




