Reading Time: < 1 minute

పోలీసుల దెబ్బలకే సాయికృష్ణ చనిపోయాడు: సిట్ నివేదికలో సంచలనం…

Caption of Image.

ఏపీలో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రాజకీయంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్ నివేదికలో సంచలన విషయం వెల్లడైంది. పోలీసుల దెబ్బలకే సాయికృష్ణ చనిపోయాడంటూ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది సిట్. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ( సెప్టెంబర్ 18 ) హైకోర్టుకు నివేదిక సమర్పించింది సిట్. పోలీసులే సాయికృష్ణను కొట్టి చంపారని పేర్కొంది సిట్.

ఈ కేసులో ఏ4గా  సురేశ్ రిమాండ్ రిపోర్టులో ఈ విషయం స్పష్టం చేసింది సిట్.  సీఐ నాగరాజు,సురేష్ , హెడ్ కానిస్టేబుల్ అశోక్ కలిసి సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారని..ఆధారాలు మాయం చేశారని కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. మే7న పీఎస్ లో సాయికృష్ణను విచారించారని.. రాణిగారితోటలోని పాడుబడ్డ భవనానికి తీసుకెళ్లి కొట్టారని తెలిపింది సిట్. మే 12న సాయికృష్ణ మృతిచెందాడని తెలిపింది సిట్.

►ALSO READ | వైఎస్ వివేకా హత్య కేసులో CBI కోర్టు కీలక నిర్ణయం

సాయికృష్ణ మృతదేహాన్ని అర్ధరాత్రి బైక్ పై శ్మశానానికి తరలించారని.. స్వర్గపురి శ్మశానవాటికలో మృతదేహాన్ని కాల్చేశారని తెలిపింది సిట్. సాయికృష్ణపై దాడికి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేశారని.. సాయికృష్ణ బంధువులను పోలీసులు బెదిరించారని తెలిపింది సిట్. హెబియస్ కార్పస్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు, బంధువులను పోలీసులు ప్రలోభపెట్టారని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది సిట్.
 

©️ VIL Media Pvt Ltd.