దుబ్బాకలో పేలిన ఫ్రిడ్జ్.. పూర్తిగా కాలిపోయిన ఇల్లుCaption of Image.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో తృటిలో ఒక పెను ప్రమాదం తప్పింది. చెల్లాపూర్ గ్రామానికి చెందిన బాసిరెడ్డి వెంకట్రెడ్డి ఇంట్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాద తీవ్రతకు ఇంట్లోని ఫ్రిడ్జ్ భారీ శబ్దంతో పేలిపోయింది.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండి ఉంటే ప్రమాద తీవ్రత మరెంత ఘోరంగా ఉండేదోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు అప్రమత్తమయ్యారు.