National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..

National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ అల్ థానీ ఆదివారం ఉదయం మరణించారు. 74 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఖతార్ మాజీ పాలకుడికి భారత్ నివాళులు అర్పించింది. ఖతార్ ఎమిర్ పితామహుడిగా పేరున్న షేక్ హమద్ గౌరవ సూచకంగా సోమవారం ఒక రోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సంతాపదినమైన రోజున భారత్ అంతటా సాధారణంగా జెండా ఎగరవేసే అన్ని భవనాలపై జెండాను సగం వరకు అవనతం చేస్తారని, ఆ రోజున ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) ఆదివారం తెలిపింది.
ప్రధాని నరేంద్రమోడీ, షేక్ హమద్ను ‘‘ఖతార్ గొప్ప అభివృద్ధి, శ్రేయస్సు దిశగా నడిపించిన దార్శనిక నాయకుడు’’గా అభివర్ణించారు. “ఫిబ్రవరి 2024లో నేను ఖతార్లో చివరిసారిగా పర్యటించినప్పుడు ఆయనను కలిసే గౌరవం నాకు లభించింది, ఆయనను ఒక నిజమైన స్నేహితుడిగా కూడా మేము గుర్తు చేసుకుంటాము,” అని మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.