Reading Time: < 1 minute
YS Jagan : మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే గ్రోత్‌ కారిడార్‌గా MAVIGUN

ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని సమస్యకు సుస్థిరమైన, ఖర్చు తక్కువతో కూడిన పరిష్కారాన్ని వైఎస్ జగన్ ప్రతిపాదించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ 110 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్‌ను మావిగన్గా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో ఉందని, విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ కారిడార్ పొడవునా రాజధాని అవసరాలకు తగ్గట్టుగా భవనాలను నిర్మించడం ద్వారా, రెండు లక్షల కోట్ల రూపాయల భారీ వ్యయంతో కూడిన ప్రణాళికలతో పోలిస్తే, కేవలం 10 శాతం నిధులతోనే అద్భుతమైన రాజధానిని ఏర్పాటు చేయవచ్చని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇది డే వన్ నుంచే పనిచేసే రాజధానిని అందించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌గా మారడంతో పాటు స్థానిక యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని ఆయన వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖ రైల్వే జోన్ కల నెరవేరింది.. కానీ ఇప్పడు మరో సమస్య వచ్చి పడింది

మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదాబేగం యత్నం

పూర్తిస్థాయి శాంతి ఒప్పందం దిశగా అమెరికా – ఇరాన్

అవుట్ సైడ్ ఫుడ్ తింటే దవాఖానలో బెడ్డే..!

వరంగల్‌లో కుక్కల అరాచకం! వేలు తెగేలా కొరికిన పిచ్చికుక్క