
రంగారెడ్డి జిల్లా:
* ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 3వ వార్డులో గెలిచిన ఇండిపెండెంట్ దాసరి మురళీకృష్ణ కనిపించడం లేదని, కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు
* 19వ వార్డులో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి కనిపించడం లేదంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అతని ఫ్యామిలీ కంప్లైంట్
వరంగల్ జిల్లా:
- తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియల్ ఓటు హక్కు కల్పించవద్దని ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతల కంప్లయింట్
జగిత్యాల జిల్లా:
* జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్గా సమిండ్ల వాణి పేరు ఖరారు
* సీల్డ్ కవర్లో మున్సిపల్ కార్యాలయానికి చేరిన వాణి పేరు
* సంజయ్ వర్గానికే చైర్ పర్సన్ పీఠం
మహబూబాబాద్ జిల్లా:
- తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత
- భారీగా మోహరించిన పోలీసులు
- తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 16, ఇద్దరు ఎక్స్ అఫిషీయో సభ్యులతో కలిసి 18 ఓట్లు
- మేజిక్ ఫిగర్ 10.. బీఆర్ఎస్ 09, కాంగ్రెస్ 07
- ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషీయో ఓట్లతో 09కి చేరిన కాంగ్రెస్ బలం
- బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారని ప్రచారం
- జనసమీకరణకు బీఆర్ఎస్ వ్యూహం
- భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు, కొనసాగుతున్న ఉద్రిక్తత
- హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్మన్గా రోంటాల సుహాసిని
నల్గొండ జిల్లా:
* హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి.. వైస్ చైర్మన్గా రాజా రమేష్ యాదవ్
*నందికొండ మున్సిపల్ చైర్మపర్సన్గా బడుగు మానస స్వర్ణ సుమన్ ఎన్నిక
సూర్యాపేట జిల్లా:
* కోదాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకం
* మొదటి రెండు సంవత్సరాలు చైర్మన్ గా ఎర్నేని కుసుమ.. వైస్ చైర్మన్ గా దేవరపల్లి మల్లీశ్వరి
* మిగిలిన మూడు సంవత్సరాలు చైర్మన్ పారా సత్యవతి.. వైస్ చైర్మన్ గా గుండపనేని పద్మావతి
మున్సిపల్ ఎన్నికల నంబర్ గేమ్లో గెలిచేదెవరో తేలే సమయం దగ్గర పడింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టగా.. తమకు పట్టున్న చోట పీఠాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సోమవారం కార్పొరేషన్ మేయర్, మున్సిపల్చైర్ పర్సన్స్ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా గెలిచిన వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పాలకవర్గం ఎన్నికలు ఉంటాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తమకు ఆధిక్యం ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చాలా ఈజీగా గెలుచుకోనున్నది.
ఇదే క్రమంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని హంగ్ స్థానాలను సైతం కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నది. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి రంగంలోకి దిగి రాష్ట్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జారిపోకుండా బీఆర్ఎస్, బీజేపీ విప్ జారీ చేయడానికి సిద్ధమయ్యాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సైతం విప్ వర్తించేలా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేస్తున్నది. కాగా, 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పరోక్ష ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి చోట పోలీస్ బందోబస్తు మధ్య సీసీ కెమెరాల సహాయంతో వెబ్కాస్టింగ్ చేయనున్నారు.