
- – హన్మకొండ నుంచి ట్రిప్పులు
- – నేటి నుంచి ప్రారంభం
ములుగు, వెలుగు: మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 28నుంచి మహాజాతర ప్రారంభం కానుండగా ఈ సర్వీసులను వారం ముందు నుంచే ప్రారంభిస్తున్నారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్ లైన్స్ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. మేడారం సమీపంలోని పడిగాపూర్వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి జాయ్రైడ్ ఫ్రారంభం అవుతుంది. గురువారం ప్రారంభమయ్యే సేవలకు.. 6 నుంచి 7నిమిషాల రైడ్ కు ఒక్కొక్కరి నుంచి రూ.4, 800 చార్జ్ చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా హన్మకొండ నుంచి మేడారం జాతరకు రావాలనుకునే భక్తులకు కూడా ఈ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
హన్మకొండలోని ఆర్ట్స్అండ్సైన్స్కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి మేడారానికి ఒక్కొక్కరి నుంచి రూ.35,999లు చార్జ్చేయనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. జాతర ముగిసే తేదీ 31 వరకు హెలికాప్టర్ సేవలు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. సర్వీసులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే కొనసాగనున్నాయి. పూర్తి వివరాలకు 8530004309, 9676320139 నెంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.