
కోలీవుడ్ వర్సటైల్ నటుడు సూర్య ప్రస్తుతం వరుస బ్లాక్బస్టర్ విజయాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించడంతో పాటు రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అదే జోష్ లో తెలుగు దర్శకుడితో చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పడు సూర్య 50వ సినిమా ఏంటనే దానిపై ఒకటే డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్గా ‘కరుప్పు 2’ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కోలీవుడ్ సినీ వర్గాల్లో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.
విశిష్టమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న సూర్య కెరీర్లో 50వ చిత్రంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా ‘కరుప్పు 2’ రూపుదిద్దుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కరుప్పు బ్లాక్ బస్టర్ కావడం దృష్ట్యా దీని సీక్వెల్ను సూర్య ల్యాండ్మార్క్ మూవీగా తీసుకువస్తే హైప్ భారీగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మైలురాయి ప్రాజెక్ట్ను తెరకెక్కించేందుకు టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీతో డిస్కషన్స్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘రోలెక్స్’ స్టాండలోన్ సినిమా లేదా సీక్వెల్స్ కూడా సూర్య 50వ ప్రాజెక్ట్ రేసులో ఉన్నాయనే ప్రచారం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అయితే సూర్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఏ దర్శకుడి వైపు మొగ్గు చూపుతారు ‘కరుప్పు 2’ సీక్వెల్ ప్రకటన ఎప్పుడు రానుంది అనే విషయాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.