Reading Time: 2 minutes

ఆర్టీసీ ‘నైట్ రైడర్’ రయ్ రయ్.. పెరుగుతున్న ఆదరణ.. 5 రూట్లలో 80 శాతం సీట్లు ఫుల్లు

Caption of Image.
  • మరో రూట్​లో 50 శాతమే   
  •  ఆదరణను బట్టి సర్వీసులు పెంచాలని నిర్ణయం 

హైదరాబాద్​సిటీ సిటీ, వెలుగు : మహానగరంలో నైట్​లైఫ్ కు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చిన ‘నైట్​రైడర్’ సర్వీసులకు ఆదరణ లభిస్తోంది. 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభించిన ఈ థర్డ్​షిఫ్ట్​ సర్వీసులు ప్రస్తుతం 6 రూట్లలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నడుస్తున్నాయి. 222ఏ, 218, 219, 290యు, 195డబ్ల్యూ, 10హెచ్​ వంటి రూట్లలో రెండు నుంచి నాలుగు బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇంతకుముందు రాత్రి వేళల్లో బస్సు సర్వీసులు లేకపోవడం వల్ల ఊళ్లకు వెళ్లి రాత్రిళ్లు వచ్చేవారు, నైట్​షిఫ్ట్​డ్యూటీలు చేసే సాఫ్ట్​వేర్, ఇతర ప్రైవేట్​ఉద్యోగులు కష్టాలు పడేవారు. తప్పనిసరిగా క్యాబ్​లు, ఆటోల్లో వెళ్లాల్సి రావడంతో ఖర్చులు తడిసి మోపెడయ్యేవి. నైట్​రైడర్​బస్సుల్లో సాధారణ ఛార్జీలనే తీసుకుంటుండడంతో పాటు మహిళలకు స్కీంను కూడా వర్తింపజేయడం కలిసివచ్చింది.  

222ఏ రూట్ లో నాలుగు బస్సులు 

కోఠి – పటాన్​చెరు(222ఎ) సర్వీసులో 80 శాతం ప్రయాణికులు జర్నీ చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. ఈ బస్సులో కోఠి నుంచి ఆబిడ్స్, లక్డీకాపూల్, మాసాబ్​టాంక్, బంజారాహిల్స్​కేర్ హాస్పిటల్, అన్నపూర్ణ స్టూడియో, గుట్టల బేగంపేట, హైటెక్​సిటీ, కొండాపూర్​, హఫీజ్​పేట్, లింగంపల్లి, ఆర్సీపురం, బీరంగూడ మీదుగా పటాన్​చెరు వెళ్తుండడంతో ఈ రూట్​లో రాత్రిళ్లు వెళ్లేవారికి ఉపయోగకరంగా మారాయి. మొత్తం నాలుగు బస్సులను తెల్లారేవరకు ట్రిప్పులు కొడుతుండడంతో తిప్పలు తప్పాయి. 

 కోఠి–పటాన్​చెరు(218) సర్వీసు కూడా లక్డీకాపూల్, ఎస్ఆర్​నగర్, కేపీహెచ్​బీ కాలనీ, మియాపూర్, లింగంపల్లి, ఆర్సీపురం మీదుగా పటాన్​చెరుకు వెళ్తోంది. ఈ రూట్​లో రెండు బస్సులను నడుపుతుండగా ఇందులో కూడా 80 శాతం సీట్లు ఫుల్​అవుతున్నాయి. 
    సికింద్రాబాద్​–పటాన్​చెరు(219) బస్సు సికింద్రాబాద్​రైల్వేస్టేషన్​నుంచి స్టార్టయి ప్యారడైజ్, బోయిన్​పల్లి, బాలానగర్​ క్రాస్​రోడ్స్, ఐడీపీఎల్, ప్రశాంత్​నగర్, కూకట్​పల్లి, కేపీహెచ్​బీ కాలనీ, హైదర్​నగర్​, లింగంపల్లి, ఆర్సీ పురం మీదుగా పటాన్​చెరు వరకు వెళ్తుండగా 75 శాతం ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు.  

    బాచుపల్లి-వేవ్​రాక్​(195డబ్ల్యూ) రూట్​బస్సు బాచుపల్లిలో మొదలై నిజాంపేట, జేఎన్​టీయూ, కేపీహెచ్​బీ, మలేషియన్​టౌన్​షిప్​, హైటెక్​సిటీ, గచ్చిబౌలి ఎక్స్​రోడ్, గచ్చిబౌలి స్టేడియం, హెచ్​సీయూ నుంచి విప్రో సర్కిల్​​మీదుగా వేవ్​రాక్​​చేరుకుంటుంది. ఇందులోనూ 80 శాతం ఆక్యుపెన్సీ ఉండగా, మూడు బస్సులను నడుపుతున్నారు. 

    10హెచ్​కు సంబంధించి రెండు బస్సులను నడుపుతుండగా ఒకటి రాణిగంజ్​డిపో నుంచి బయలుదేరి సికింద్రాబాద్​మీదుగా బేగంపేట్, అమీర్​పేట్, యూసుఫ్​గూడ ఎక్స్​రోడ్​, వెంకటగిరి, నవయుగ, పెద్దమ్మ గుడి, మాదాపూర్​పీఎస్​కొండాపూర్​వెళ్తోంది. మరొకటి కొండాపూర్​నుంచి మాదాపూర్, పెద్దమ్మ గుడి మీదుగా సేమ్​రూట్​లో సికింద్రాబాద్​చేరుకుంటుంది. ఈ బస్సులోనూ 80 శాతం ఆక్యుపెన్సీ ఉంటోందని అధికారులు తెలిపారు.  

290యులో 50 శాతమే..

హయత్​ నగర్​– సికింద్రాబాద్​(290యు) రూట్​లో బస్సులు హయత్​నగర్​ నుంచి మొదలై భాగ్యలత, పనామా, ఎల్​బీనగర్​, అల్కాపురి, నాగోల్​, సర్వే ఆఫ్​ ఇండియా, ఎన్జీఆర్​ఐ, తార్నాక, ఆలుగడ్డబాయి మీదుగా సికింద్రాద్​వరకు నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో మాత్రం 50శాతం ఆక్యుపెన్సీనే ఉంటోందని అధికారులు తెలిపారు. ఈరూట్​లో మూడు బస్సులు నడుస్తున్నాయి.   

©️ VIL Media Pvt Ltd.