
ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ రానా ఏమంటున్నాడు. (ప్లాష్) సినిమా ప్రేక్షకుల ఆలోచనా విధానంలో క్రమంగా మార్పు వస్తోందని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి చెబుతున్నాడిప్పుడు. ఒకప్పుడు స్టార్ హీరో పేరు చూసి సినిమాలకు వెళ్లే ఆడియన్స్.. ఇప్పుడు డైరెక్టర్ బ్రాండ్, అండ్ డైరెక్టర్ మేకింగ్ స్టైల్ను చూస్తున్నారన్నాడు. ఈ జనరేషన్ ఆడియన్స్లో ‘హీరో ఫస్ట్’ కంటే ‘డైరెక్టర్ ఫస్ట్’ ట్రెండ్ పెరుగుతోందని రానా షాకింగ్స్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆడియన్స్ సినిమాను ఎంచుకునే విధానంలో చాలా మార్పు వచ్చిందని రానా తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. హీరో ఎవరు అనే దానితో పాటు.. సినిమాను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ ఎవరు? ఆయన గతంలో ఎలాంటి సినిమాలు చేశారు? ఎలాంటి కథలను ఎలా తెరకెక్కిస్తారు? అనే విషయాలను కూడా ఆడియన్స్ గమనిస్తున్నారని రానా అన్నాడు. తమకంటూ ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్, బ్రాండ్ను ఏర్పరచుకున్న దర్శకుల సినిమాలపై ఆడియన్స్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తోందని రానా అన్నాడు. ఎగ్జాంపుల్గా ఎస్.ఎస్. రాజమౌళి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల పేర్లను రానా ప్రస్తావించారు. వీరి సినిమాలకు హీరోలతో పాటు దర్శకుల బ్రాండ్ కూడా స్పెషల్ అట్రాక్షన్గా మారిందన్నాడు రానా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూమి నుంచి నేరుగా అంతరిక్షానికి లిఫ్ట్.. త్వరలో నిజం కానుందా?
చంద్రుడు, అంగారకుడిపై ఇల్లు ఎలా? భవిష్యత్ దారి చూపించిన శుభాన్షు శుక్లా!
తమిళ సినిమా కోసం.. లైఫ్ ని రిస్క్ లో పెట్టాడు..
‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు రిలీజ్కు పెద్ద అడ్డంకి
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే..!