
ప్రస్తుతం మాస్కోలో ట్రంప్ ప్రత్యేక దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పర్యటిస్తున్నారు. ట్రంప్ పంపించిన ప్రతిపాదనను రష్యాకు తీసుకొచ్చారు. పుతిన్తో చర్చలు అనంతరం ఆదివారం కీవ్కు వెళ్లనున్నారు. అక్కడ జెలెన్స్కీతో సమావేశమై చర్చలు జరపనున్నారు.

ఇలాంటి తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్పై మూడు రోజుల పాటు దాడులు ఆపేయాలని పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కోకు చేరుకోవడంతో పుతిన్ ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ దూతలు యుద్ధానికి ముగింపు పలికే ప్రతిపాదనతో రష్యాకు వెళ్లిన నేపథ్యంలో పుతిన్ తాజా ఆదేశాలు వెలువడటం.. శాంతి చర్చలపై ఆశలు చిగురుస్తున్నాయి.
ఇటీవల కర్గిజ్స్థాన్లో పుతిన్తో మోడీ సమావేశమైనప్పుడు యుద్ధానికి ముగింపు పలకాలని కోరారు. ఇది యుద్ధ కాలం కాదని పేర్కొన్నారు. అలాగే ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ కీవ్ పర్యటన సందర్భంగా జెలెన్స్కీతో సమావేశమై యుద్ధానికి ముగింపు పలకాలని.. అలాగే భారత్ మధ్యవర్తిత్వం వహిస్తుందని హామీ ఇచ్చారు.