
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై చర్యలకు కాంగ్రెస్ సిద్ధమైంది. మంత్రి కొండా సురేఖ రాజీనామా చేసేందుకు ససేమిరా అనడంతో ఆమెను బర్తరఫ్ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. కొండా సురేఖ ఇప్పటికే వరంగల్ వెళ్లి కార్యకర్తలతో సమావేశం కావడంతో ఆమె రాజకీయ భవిష్యత్పై పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.
ఇదిలా ఉంండగా.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డికి కూడా ఉద్వాసన తప్పలేదు. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్గా నేరెళ్ల శారదను నియమించారు. కుడా చైర్మన్గా గుండు సుధారాణిని నియమించారు.