
బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ అండ్ విజువల్ వండర్ ‘ఇరుముడి’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన నాటి నుంచి థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, తాజాగా నైజాం రీజియన్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. కేవలం 13 రోజుల్లోనే ఈ సినిమా నైజాం వ్యాప్తంగా రూ. 76 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, అఫీషియల్ గా రూ. 75 కోట్ల క్లబ్లో చేరింది.
నైజాం ఏరియాలో ఇప్పటివరకు కేవలం కొద్దిపాటి భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రాలకు మాత్రమే రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని చేరుకోవడం సాధ్యమైంది. ఇప్పుడు అదే బాటలో ‘ఇరుముడి’ వేగంగా ఆబ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలో చేరేందుకు జెట్ స్పీడ్ లో అడుగులు వేస్తోంది. ఇతర సినిమాలు రిలీజ్ అయినా కూడా సూపర్ హోల్డ్ చేస్తూ వీకెండ్స్ లో హౌస్ఫుల్ బోర్డులతో నైజాం బాక్సాఫీస్పై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న లాభాల లెక్కలు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నైజాం రీజియన్లో ఈ చిత్రం వ్యాపార విలువ కేవలం రూ. 7 కోట్లు మాత్రమే కావడం విశేషం. అతి తక్కువ థియేట్రికల్ బిజినెస్ విలువతో బరిలోకి దిగిన ‘ఇరుముడి’, నైజాంలో ఫుల్ రన్ ముగిసే సమయానికి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించే దిశగా దూసుకుపోతోంది. కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఇది ఇప్పటికే ఊహించని రేంజ్లో భారీ లాభాలను తెచ్చిపెట్టి, ఆల్-టైమ్ సంచలన బ్లాక్బస్టర్గా నిలిచింది.