Reading Time: < 1 minute
Moeenabad Farmhouse Drugs Case Putta Mahesh Kumar Positive

Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌కు డ్రగ్స్ పాజిటివ్‌ వచ్చింది. బ్లడ్‌ శాంపిల్స్‌లో ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రక్త పరీక్షల్లో మహేష్‌ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. నిన్న యూరిన్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. యూరిన్ టెస్ట్‌తో పాటు మరోసారి బ్లడ్ టెస్ట్ చేశారు అధికారులు.. యూరిన్ టెస్ట్ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. నీళ్లు కలపడంతోనే మహేష్‌కు డ్రగ్స్ నెగటివ్ వచ్చినట్లు అధికారులు తేల్చారు. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చింది. మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఎంపీ పుట్టా మహేష్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌, రితేష్ రెడ్డి, నమిద్ మిశ్రా, కౌశిక్‌ రవి, అర్జున్‌ రెడ్డి ఉన్నారు. ఇక ఈ పార్టీని పైలెట్‌ రోహిత్‌రెడ్డి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ డ్రగ్‌ పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు పాల్గొన్నారు.

READ MORE: Golden Era of Indian Cricket: భారత క్రికెట్‌లో స్వర్ణయుగం.. రెండు సంవత్సరాల్లో 8 అంతర్జాతీయ ట్రోఫీలు!