Reading Time: < 1 minute
Rajendra Prasad Apologizes For Comments On Mgr

తాజాగా నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు కొద్దిరోజుల క్రితం కాంతారావు అవార్డు ప్రకటించారు. ఆ అవార్డు అందుకుంటున్న సమయంలో కాంతారావును పొగుడుతూ, తమిళనాడు మాజీ సీఎం, అక్కడ అత్యంత జనాదరణ కలిగిన నటుడు ఎం.జి.ఆర్. ను ఆయన విమర్శించారు. కాంతారావును చూసి ఆయన భయపడిపోయేవారు అని అర్థం వచ్చేలా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయం మీద అక్కడి నటీనటులు సీరియస్ అవుతున్నారు. తాజాగా విషయాలు ఒకటి చేయగా నాజర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తమిళంలో క్షమాపణలు చెబుతూ రాజేంద్ర ప్రసాద్ ఒక వీడియో రిలీజ్ చేశారు.

Also Read:Allu Ayaan: సినిమా వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్న అల్లు అయాన్

“అందరికీ నమస్కారం, నేను తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్‌ని. నాకు రెండు రోజులకు ముందు ఈ ఊర్లో ఒక ఫంక్షన్ చేశారు. అక్కడ మహానటుడు కాంతారావు అవార్డు మాకు అందించారు. ఆ ఫంక్షన్ లో నేను మాట్లాడే సమయంలో సరదాగా మాట్లాడుతూ, తమిళ సినిమాకు దేవుడు లాంటి ఎం.జి.ఆర్. గురించి సరదాగా ఒక తప్పు మాట మాట్లాడాను. ఆయన గురించి ఎవరైనా అలా మాట్లాడతారా? మాకు కూడా ఆయన అంటే ఎనలేని గౌరవం. పొరపాటున ఆ మాట వచ్చిందే కానీ, ఆయన్ని అగౌరవపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నేను మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్నప్పుడు ఆయనే సీఎం. ఆయన మాటల నుంచి కూడా నేను ఇన్‌స్పైర్ అయ్యాను. ఆయన గురించి నేను పొరపాటున అలా మాట్లాడాను. అలా మాట్లాడినందుకు ఎవరైనా ఫీలయ్యి ఉంటే నన్ను క్షమించండి. ఇకమీదట ఎప్పుడూ నేను అలా మాట్లాడను అని మాటిస్తున్నాను. ఈ విషయంలో నన్ను క్షమించండి”

అని ఆయన పేర్కొన్నారు.