Reading Time: < 1 minute
Abhijeet Dipke Reveals Cjps Next Strategy After Dharmendra Pradhan Resignation

Abhijeet Dipke: ‘‘ఉద్యమం ముగిసింది. కానీ పోరాటం కాదు’’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. తమ పోరాటం కొనసాగుందని స్పష్టం చేశారు. విద్యా సంస్కరణలు, యువత సమస్యలు, ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి వ్యూహాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పంజాబ్ పేపర్ లీక్ విషయంపై స్పందిస్తూ.. దీనిపై త్వరలో స్పందిస్తామని, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, కొంత సమయం కావాలని అన్నారు. విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, ఎలాంటి విద్యార్థిపైనా కేసులో నమోదు చేయకూడదనేదే తమ డిమాండ్ అని చెప్పారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ఉద్యమానికి ముగింపు కాదని, అది పెద్ద పోరాటానికి ఆరంభం మాత్రమే సీజేపీ స్పష్టం చేసింది. యువత సమస్యలను లేవనెత్తడం, విద్య , పరిపాలనలో మెరుగుదల కోసం ప్రచారం కొనసాగించడం తమ సంస్థ కొనసాగిస్తుందని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. మరోవైపు, ఆ సంస్థ నాయకుడు అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాన్ని కొట్టిపారేయలేదు. “రాజకీయాల్లో ఎప్పుడూ ‘అసాధ్యం’ అనకూడదు” అని వ్యాఖ్యానించారు.