July 21, 2026

Jitendra Singh: రాహుల్ గాంధీ మాటపై నిలబడటం లేదు..

Jitendra Singh: రాహుల్ గాంధీ మాటపై నిలబడటం లేదు..
Reading Time: < 1 minute
Jitendra Singh Rahul Gandhi Changed Demands Parliament Discussion

Jitendra Singh: ప్రధాని నరేంద్రమోడీ నివాసం సమీపంలో కాంగ్రెస్ మెరుపు ధర్నా చేపట్టింది. ధర్నా సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆయనతో చర్చించారు. అయితే, కాంగ్రెస్ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ తన మార్చి మరో కొత్త డిమాండ్‌ను ముందుకు తెచ్చారని ఆరోపించారు. ప్రధాని కార్యాలయం(పీఎంఓ) సహాయ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ ధర్నా ప్రారంభమైన గంట తర్వాత అక్కడికి చేరుకుని కాంగ్రెస్ అధినేతతో చర్చించారు.

ఈ సమావేశంపై జితేంద్ర సింగ్ ఎక్స్‌లో స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి సీనియర్ నేతలు నిరసనకు నాయకత్వం వహిస్తున్నందున, కేంద్ర ప్రభుత్వం తనతో పాటు కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్‌ను చర్చల కోసం పంపిందని తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌లు, ఇతర పరీక్షలపై అవకతవకలు, వాటికి సంబంధించిన నిరసనలపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే ధర్నా విరమిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, తాము అందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశామని చెప్పారు. రాహుల్ గాంధీ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిన తర్వాత మరో కొత్త షరతు ముందుకు తెచ్చారని, దీంతో చర్చలు ఎలాంటి నిర్ణయానికి రాకుండా ముగిసినట్లు వెల్లడించారు.