July 20, 2026

లార్డ్స్లో ఇంగ్లాండ్తో చివరి వన్డే.. చివరి నిమిషంలో భారత జట్టులో భారీగా మార్పులు! 

లార్డ్స్లో ఇంగ్లాండ్తో చివరి వన్డే.. చివరి నిమిషంలో భారత జట్టులో భారీగా మార్పులు! 
Reading Time: 2 minutes

లార్డ్స్లో ఇంగ్లాండ్తో చివరి వన్డే.. చివరి నిమిషంలో భారత జట్టులో భారీగా మార్పులు! 

Caption of Image.

ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో అలాగే సిరీస్ నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. గాయపడిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే (Harsh Dubey) ను జట్టులోకి చేర్చినట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) అధికారికంగా ప్రకటించింది.

సుందర్‌కు హ్యామ్‌స్ట్రింగ్ గాయం: 
కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ కుడి హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. దీంతో అతను ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. బీసీసీఐ దీనిపై స్పందిస్తూ,  వాష్టింగన్ తదుపరి చికిత్స కోసం స్కాన్‌లు చేయించుకుని, నిపుణుల సలహా తీసుకోనున్నాడని తెలిపింది. అతను పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

అంతర్జాతీయ వేదికపై హర్ష్ దూబే ప్రదర్శన: 
యువ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేకు ఇంగ్లాండ్ కండిషన్స్‌లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. జూన్ నెలలో ధర్మశాలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా దూబే వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన రెడ్-బాల్ సిరీస్‌లో ఇండియా ‘ఎ’ విజయం సాధించడంలోనూ దూబే కీలక పాత్ర పోషించాడు. అక్కడ 4 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 30, 29 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం వన్డే జట్టులోని స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లతో దూబే జతకట్టనున్నాడు.

లార్డ్స్ మ్యాచ్ ముగియగానే జింబాబ్వే టూర్‌కు పయనం: 
ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ ముగిసిన వెంటనే హర్ష్ దూబే నేరుగా జింబాబ్వే వెళ్లనున్నాడు. అక్కడ జూలై 23 నుంచి హరారే వేదికగా ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అతను పాల్గొంటాడు. ఈ సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లు జూలై 25, 26 తేదీలలో హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్నాయి.

ALSO READ : రోహిత్, కోహ్లీ ఫ్యూచర్‌పై బిగ్ డిస్కషన్.. 

భారత్ స్క్వాడ్: 
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే. 

©️ VIL Media Pvt Ltd.