July 22, 2026

Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్

Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
Reading Time: < 1 minute
Government Slams Congress Protest Pm Modi Residence Security Threat

Congress: ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాను చేపట్టింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో సహా కీలక కాంగ్రెస్ నేతలు ఈ ధర్నాకు హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే పుట్టిన రోజును కవర్‌గా ఉపయోగించుకున్న కాంగ్రెస్ నేతలు, అక్కడి నుంచి ఒక్కసారిగా ప్రధాని నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. నీట్ పరీక్షా పేపర్ లీక్, సోమవారం పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చిన నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల దాడుల్ని నిరసించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు.

అయితే, ఈ ఆందోళనల భద్రతాపరంగా తీవ్రమైన ముప్పును సృష్టించడమే కాకుండా, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రమాదకర ఉదాహరణ నెలకొల్పిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ నాయకుల అధికారిక నివాసాలను లక్ష్యంగా చేసుకుని నిరసన చేపట్టడం పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో కనిపించదని పేర్కొన్నారు. ఇది భద్రతా ప్రమాదాలను పెంచడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రధాని నివాసం వద్ద నిరసన నిర్వహించడం హద్దులు దాటిన చర్యగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన ఘటనల్ని ప్రస్తావించాయి. బంగ్లాదేశ్‌లో 2024లో షేక్ హసీనా రాజీనామా అనంతరం నిరసనకారులు ఆమె అధికారిక నివాసం అయిన గణభవన్‌లోకి చొరబడిన ఘటనల్ని, నేపాల్‌లో రాజకీయ అశాంతి సమయంలో మాజీ ప్రధానులు, మంత్రుల నివాసాలపై దాడులను ఉదాహారణలుగా చూపింది. మరోవైపు, నిరసన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.