July 20, 2026

రోహిత్, కోహ్లీ ఫ్యూచర్‌పై బిగ్ డిస్కషన్.. మధ్యలోకి మెస్సీని లాగిన మాజీ క్రికెటర్!

రోహిత్, కోహ్లీ ఫ్యూచర్‌పై బిగ్ డిస్కషన్.. మధ్యలోకి మెస్సీని లాగిన మాజీ క్రికెటర్!
Reading Time: 2 minutes

రోహిత్, కోహ్లీ ఫ్యూచర్‌పై బిగ్ డిస్కషన్.. మధ్యలోకి మెస్సీని లాగిన మాజీ క్రికెటర్!

Caption of Image.

Rohit Sharma vs Virat Kohli: ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ రోహిత్‌కు చివరిది అంటూ గత కొన్ని రోజులుగా పెద్దెత్తున్న ప్రచారం జరిగింది. ఈ పుకార్లని బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. లార్డ్స్ మ్యాచ్ హిట్ మ్యాన్ కి లాస్ట్ ది కాదని తెలిపారు. ఈ సందర్భంగా హెడ్ కోచ్, సెలక్షన్ కమిటీపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

రోహిత్, కోహ్లీ ఫ్యూచర్‌పై బిగ్ డిస్కషన్: 
2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై జరుగుతున్న చర్చపై టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు దిగ్గజ ప్లేయర్స్ అనుభవం రాబోయే మెగా టోర్నీలో ఇండియాకు కీలకం కానుందని తెలిపాడు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా రోహిత్‌ను వన్డే జట్టు నుంచి పక్కన పెట్టడం మంచిది కాదన్నాడు. 

లియోనెల్ మెస్సీతో పోలిక: 
మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రాముఖ్యతను ఫుట్‌బాల్ ప్రపంచకప్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీతో పోల్చారు. మెస్సీకి ఇప్పుడు 39 ఏళ్లు.. అయినా అతని అనుభవం, మార్గదర్శకత్వంలో అర్జెంటీనా జట్టు ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో అతను నేరుగా గోల్ చేయకపోయినా, అద్భుతమైన అసిస్ట్ అందించి మ్యాచ్ ని గెలిపించాడు. అనుభవం అంటే ఇదే.. జట్టులో మ్యాచ్‌లను ముగించగల యంగ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు, వారిని సరైన మార్గంలో నడిపించడం, అవకాశాలను సృష్టించడం సీనియర్ ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమవుతుందన్నాడు. అర్జెంటీనాకు మెస్సీ ఎలాంటివాడో, వరల్డ్ కప్‌లో భారత్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా అలాంటివారని కైఫ్ వెల్లడించాడు. 

గిల్ కెప్టెన్సీకి వీరిద్దరు అవసరం: 
ఫుట్‌బాల్ అయినా, క్రికెట్ అయినా సరే పెద్ద టోర్నమెంట్లలో అనుభవం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని మహమ్మద్ కైఫ్ స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. రాబోయే 2027 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. అక్కడి బౌన్సీ పిచ్‌లపై ఆడటం అంత ఈజీ కాదు. కాబట్టి యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో భారత జట్టు సక్సెస్ కావాలంటే, కఠినమైన సౌతాఫ్రికా కండిషన్స్‌లో వీరిద్దరి అవసరం 100 శాతం ఉంటుందని తేల్చి చెప్పారు. ఇప్పటి నుంచే వారు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతూ, మంచి ఫామ్‌లో కొనసాగడం జట్టుకు ఎంతో అవసరమని కైఫ్ పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.