July 19, 2026

రైతుల ధాన్యం డబ్బులు సొంత ఖాతాలోకి.. పెద్ద రావులపల్లి  సర్పంచ్కు కలెక్టర్ షోకాజ్ నోటీస్

రైతుల ధాన్యం డబ్బులు సొంత ఖాతాలోకి..  పెద్ద రావులపల్లి  సర్పంచ్కు కలెక్టర్ షోకాజ్ నోటీస్
Reading Time: < 1 minute

రైతుల ధాన్యం డబ్బులు సొంత ఖాతాలోకి.. పెద్ద రావులపల్లి  సర్పంచ్కు కలెక్టర్ షోకాజ్ నోటీస్

Caption of Image.

యాదాద్రి, వెలుగు :  యాదాద్రి జిల్లా భూదాన్​ పోచంపల్లి మండలం పెద్ద రావులపల్లి సర్పంచ్​ మోటె బాలకృష్ణకు కలెక్టర్​ అనురాగ్​ జయంతి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. పెద్ద రావులపల్లికి చెందిన 21 మంది రైతులు  661 బస్తాల వడ్లను సెంటర్​లో అమ్మారు. ఈ వడ్లకు సంబంధించిన అమౌంట్​ రూ. 9 లక్షలు సర్పంచ్​ బాలకృష్ణ అకౌంట్​లో జమ చేశారు. సంబంధిత రైతులకు డబ్బు ఇవ్వడంలో సర్పంచ్​ ఆలస్యం చేశారు.

దీంతో రైతులు ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. అనంతరం డబ్బులు మొత్తం రైతులకు చెల్లించారు. అయితే ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జూలూరు పీఏసీఎస్​ సెక్రటరీ ఆర్​ నర్సింహపై ఈ నెల 8న సస్పెన్షన్​ వేటు వేశారు. అగ్రికల్చర్​ ఆఫీసర్లకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. సర్పంచ్​ బాలకృష్ణ తన అకౌంట్​లో డబ్బు వేయించుకోవడంపై ఫిర్యాదు రావడంతో జిల్లా పంచాయతీ ఆఫీసర్​ శ్రీనివాసరెడ్డి విచారణ నిర్వహించి, కలెక్టర్​కు నివేదిక అందించారు. దీంతో సర్పంచ్​కు కలెక్టర్ షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

©️ VIL Media Pvt Ltd.