Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ రాగ్ మయూర్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ముంబైలో అత్యంత వైభవంగా జరిగిన ‘నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్’ వేడుకలో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డును అందుకొని జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. సూపర్ హిట్ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ అధికారిక తెలుగు రీమేక్ ‘సివరాపల్లి’ లో ఆయన పోషించిన అద్భుతమైన పాత్రకు గానూ ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. బాలీవుడ్, టాలీవుడ్తో పాటు దేశంలోని వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో, ఓటీటీ విభాగంలో దేశవ్యాప్తంగా పోటీని తట్టుకుని రాగ్ మయూర్ ఈ పురస్కారాన్ని గెలుచుకోవడం విశేషం.
2021లో వచ్చిన ‘సినిమా బండి’ చిత్రంతో నటుడిగా ప్రయాణాన్ని ప్రారంభించిన రాగ్ మయూర్, తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాత కేవలం ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా హీరోగా, కామెడీ పాత్రల్లో, విలన్గా విభిన్న కోణాలను ఆవిష్కరించారు. నటనకు స్కోప్ ఉన్న వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న రాగ్ మయూర్, త్వరలోనే హీరోగా ‘అనుమాన పక్షి’ అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ తరుణంలో ఆయనకు జాతీయ స్థాయి అవార్డు దక్కడం పట్ల టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.