ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి : మాజీ ఎంపీ వినోద్ కుమార్ Caption of Image.
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ నాయకుల విలీన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అధ్యక్షతన జరిగింది.
ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎయిర్టెల్ రాజు, పరమేశ్వర్, హరిబాబు, లక్ష్మణ్, శోభ, మారన్న, నారాయణ, రాజు యాదవ్ పాల్గొన్నారు.