July 21, 2026

జింబాబ్వేలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. వైభవ్ సూర్యవంశీపైనే అందరి కళ్లు

జింబాబ్వేలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. వైభవ్ సూర్యవంశీపైనే అందరి కళ్లు
Reading Time: < 1 minute

జింబాబ్వేలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. వైభవ్ సూర్యవంశీపైనే అందరి కళ్లు

Caption of Image.

జింబాబ్వే గడ్డపై టీమ్ ఇండియా అడుగుపెట్టింది.  భారత్, జింబాబ్వే మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం  యంగ్ టీమిండియా హరారేకు చేరుకుంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న భారత జట్టులో.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి రికార్డు సృష్టించిన ఈ వండర్ కిడ్, ఇప్పుడు జింబాబ్వేపై ఎలాంటి విద్వాంసం సృష్టిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హరారే ఎయిర్‌పోర్ట్‌లో భారత ఆటగాళ్లకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మా, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్, ఇషాన్ కిషన్ లతో కూడిన యంగ్ బ్రిగేడ్ సిరీస్ దక్కించుకోవడమే లక్ష్యంగా మైదానంలోకి దిగబోతోంది.

జులై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లోనే జరగనున్నాయి. మరి వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నుండి మరో విధ్వంసకర ఇన్నింగ్స్ వస్తుందో లేదో వేచి చూడాలి.

జింబాబ్వేలో భారత జట్టు

 శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్ ), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, రింకు సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవరతి, యాష్ థాయ్, ప్రిన్స్ యాద్, యాష్ థావ్, ప్రిన్స్ యాద్, మే ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్ ).

©️ VIL Media Pvt Ltd.