Reading Time: < 1 minute

హనుమకొండలో మల్టీ లెవెల్ సైంటిఫిక్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌

Caption of Image.

హనుమకొండ, వెలుగు: హనుమకొండలోని అశోక్ టాకీస్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలంలో రూ.15 కోట్లతో నిర్మించనున్న మల్టీ లెవెల్ సైంటిఫిక్ పార్కింగ్‌‌‌‌‌‌‌‌కు బుధవారం సాయంత్రం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన హనుమకొండ ఆర్టీసీ బస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను సందర్శించి, అక్కడి సదుపాయాలను పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్  చాహత్ బాజ్ పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి తదితరులు 
పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.