
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 44వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబై బ్యాటింగ్ హైలైట్స్..
ముంబై ఆరంభంలోనే విల్ జాక్స్ (1) వికెట్ను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, నమన్ ధీర్ అద్భుతమైన అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతను కేవలం 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కూడా 24 బంతుల్లో 5 సిక్సర్లతో మెరుపులు మెరిపించి 37 పరుగులు చేశాడు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు చేయగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. చివరలో ట్రెంట్ బౌల్ట్ ఒక సిక్సర్తో 7 పరుగులు చేసి స్కోరును 159కి చేర్చాడు.
చెన్నై బౌలింగ్ ప్రతాపం..
చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతను 3 వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బకొట్టాడు. నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసుకోగా, జామీ ఓవర్టన్ మరియు రామకృష్ణ ఘోష్ తలో వికెట్ సాధించారు. ముంబై నిర్దేశించిన ఈ 160 పరుగుల లక్ష్యం చెపాక్ పిచ్పై చెన్నైకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే, ముంబై బౌలర్లు ఈ స్వల్ప లక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటారో చూడాలి!