Reading Time: 2 minutes
టెస్ట్ ప్లేయర్‌గా స్టాంప్ వేస్తే.. 60 బంతుల్లో ఊచకోత.. కట్‌చేస్తే.. చివరి 4 బంతుల్లో దిమ్మతిరిగే ట్విస్ట్

Dubai Royals vs Gurugram Thunders: వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లో చాలా ఆశ్చర్యకరమైన మ్యాచ్ జరిగింది. గోవాలో జరుగుతున్న ఈ లీగ్‌లో దుబాయ్ రాయల్స్ గురుగ్రామ్ థండర్స్‌ను కేవలం 3 పరుగుల తేడాతో ఓడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గురుగ్రామ్ జట్టుకు చివరి 4 బంతుల్లో 4 పరుగులు మాత్రమే అవసరం అయినప్పటికీ, ఆ జట్టు 3 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. అంటే గురుగ్రామ్ జట్టు చివరి 4 బంతుల్లో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చివరి ఓవర్‌ను స్పిన్నర్ బౌలింగ్ చేయడం గమనార్హం. బ్యాట్స్‌మెన్స్ చివరి 4 బంతులకు పరుగులు చేయలేకపోయారు. గురుగ్రామ్ తరపున చతేశ్వర్ పుజారా 60 బంతుల్లో 99 పరుగులు చేశాడు. కానీ చివరి ఓవర్‌లో అతను ఔటయ్యాడు. అతను సెంచరీ మిస్ అవ్వడమే కాకుండా అతని జట్టు మ్యాచ్‌ను కూడా కోల్పోయింది.

చివరి ఓవర్లో పుజారా జట్టు ఎలా ఓడిపోయిందంటే..

చివరి ఓవర్లో గురుగ్రామ్ గెలవడానికి కేవలం 7 పరుగులు మాత్రమే అవసరం. దుబాయ్ రాయల్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ చివరి ఓవర్‌ను పియూష్ చావ్లాకు అప్పగించాడు. అతను అద్భుతంగా రాణించాడు. అతను మొదటి రెండు బంతుల్లో 3 పరుగులు ఇచ్చి, మూడవ బంతిలో పుజారాను 99 పరుగుల వద్ద స్టంప్ చేశాడు. పుజారా అవుట్ అయిన తర్వాత, చిరాగ్ గాంధీ క్రీజులోకి వచ్చి వరుసగా మూడు డాట్ బాల్స్ ఆడాడు. ఆ తర్వాత చావ్లా చివరి బంతికి అతనిని బౌల్డ్ చేశాడు.

మెరిసిన దుబాయ్ రాయల్స్..

దుబాయ్ రాయల్స్ ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ కేవలం 5 పరుగులకే ఔట్ అయ్యాడు. కిర్క్ ఎడ్వర్డ్స్ కూడా 29 బంతుల్లో 29 పరుగులు సాధించాడు. కానీ, అంబటి రాయుడు 27 బంతుల్లో 45 పరుగులు, సమిత్ పటేల్ 32 బంతుల్లో 65 అజేయంగా నిలిచి జట్టును బలోపేతం చేశాడు. పర్వేజ్ రసూల్ కూడా 17 బంతుల్లో 29 అజేయంగా నిలిచాడు.

గురుగ్రామ్ తరపున పుజారా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 14 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. కెప్టెన్ తిసారా పెరెరా కూడా 27 బంతుల్లో అజేయంగా 56 పరుగులు సాధించగలిగాడు. కానీ, చివరికి జట్టు మ్యాచ్‌ను కోల్పోయింది. పియూష్ చావ్లా చివరి ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి, తన 4 ఓవర్లలో 35 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి విజయానికి హీరోగా మారాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..