Reading Time: < 1 minute
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత.. వారికే మొదటి ప్రాధాన్యత

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. మే 1 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఒకే చోట మూడేళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీలకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు Finance Department G.O. Ms No. 38 జారీ చేసింది.

బదిలీల షెడ్యూల్

మే 1, 2026 నుంచి మే 31, 2026 వరకు బదిలీలు నిర్వహిస్తారు. బదిలీ ఆర్డర్ వచ్చిన తర్వాత 3 రోజుల్లో రిలీవ్ అవ్వాలి. జూన్ 1, 2026 నుంచి మళ్లీ బదిలీల నిషేధం అమల్లోకి వస్తుంది.

అర్హత (Eligibility)

01-01-2026 నాటికి ఒకే స్థలంలో 3 సంవత్సరాలు పూర్తి చేసిన వారు బదిలీలకు అర్హులు. ఒకే చోట 4 సంవత్సరాల కంటే ఎక్కువ కొనసాగడం అనుమతించరు.

ప్రాధాన్యత (Priority cases)

క్రింది వారికి ప్రాధాన్యత ఉంటుంది:

  • భార్యాభర్తలు (Spouse cases)
  • రిటైర్మెంట్ దగ్గర ఉన్న ఉద్యోగులు
  • 70% పైగా వికలాంగులు
  • తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారు
  • మానసిక సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులు

ముఖ్య నిబంధనలు

ఒక క్యాడర్‌లో గరిష్టంగా 40% వరకు మాత్రమే బదిలీలు చేయాలి. 2027 మే 31లోపు రిటైర్ అయ్యేవారిని, వారి అభ్యర్థన ఉన్నప్పుడే బదిలీ చేస్తారు. ఉద్యోగులు 5 ప్రాధాన్య స్థానాలు (preferences) ఇవ్వవచ్చు.

సాధారణంగా.. బదిలీల నిషేధం (transfer ban) ఆర్థిక సంవత్సరం ప్రారంభం లేదా ఇతర పరిపాలనా కారణాల వల్ల అమల్లో ఉంటుంది. అవసరాల మేరకు Telangana Government ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి నిషేధాన్ని ఎత్తివేస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులపాటు (ఉదా: 10–30 రోజులు) మాత్రమే బదిలీల ప్రక్రియకు అనుమతి ఇస్తారు.

ఆర్టీసీ జేఏసీతో చర్చలకు పిలుపు

ఏప్రిల్ 22 నుంచి తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. జేఏసీ ముఖ్య నేతలకు ఆర్టీసీ ఈడీ వెంకన్న, సీపీఎం ఉషాదేవి చర్చలకు ఆహ్వానించారు. స్థలం, సమయం చెబుతామని, అందుబాటులో ఉండాలని సూచించింది.