Reading Time: < 1 minute
Duleep Trophy 2026 East Zone Squad Ishan Kishan Vaibhav Sooryavanshi

వైభవ్ సూర్యవంశీ దూలేప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ సారథ్యం వహించనున్నాడు. సూర్యవంశీ ఇటీవల ముగిసిన యుకె పర్యటనలో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జరిగిన జింబాబ్వే టి20 సిరీస్‌లో కూడా ప్రాతినిధ్యం వహించి, ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.

ఆగస్టు 23 నుంచి బెంగళూరు వేదికగా ప్రారంభం కానున్న ఈ ప్రసిద్ధ ఇంటర్-జోనల్ మల్టీ-డే రెడ్ బాల్ టోర్నమెంట్‌లో ఈస్ట్ జోన్ తరఫున పలువురు ప్రముఖ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. ఈ జట్టులో మహమ్మద్ షమీ, అభిమన్యు ఈశ్వరన్, ముకేష్ కుమార్, షాబాజ్ అహ్మద్ , కుమార్ కుషాగ్ర వంటి ప్రముఖ ఆటగాళ్లకు చోటు లభించింది. 35 ఏళ్ల సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత భారత జట్టుకు ఆడకపోయినప్పటికీ, బెంగాల్ తరఫున 2025/26 డొమెస్టిక్ సీజన్‌లో పాల్గొంటూ దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా.. ఆయన ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 14 మ్యాచ్‌లకు గాను 13 మ్యాచ్‌లు ఆడాడు.

దూలేప్ ట్రోఫీ 2026 కోసం ప్రకటించిన పూర్తి ఈస్ట్ జోన్ జట్టు వివరాలు పరిశీలిస్తే.. ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహమ్మద్ షమీ, ముకేష్ కుమార్, కుమార్ కుషాగ్ర, శిఖర్ మోహన్, అనుకూల్ రాయ్, విరాట్ సింగ్, శుభ్రాంశు సేనాపతి, దెనిష్ దాస్, అభిజిత్ సర్కార్ ఎంపికయ్యారు. అలాగే ఈ జట్టు కోసం ఆయుష్ లోహరుకా, శ్రీదామ్ పాల్, సంబిత్ ఎస్ బరాల్, శరణ్‌దీప్ సింగ్ , స్వస్తిక్ సమాల్‌లను స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు.