Reading Time: < 1 minute
Cm Revanth Reddy Convoy Traffic

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకున్నారు. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలు నేటి నుండి అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుండి తన నివాసానికి వెళ్లేటప్పుడు ఎక్కడా వాహనాలను నిలిపివేయకుండా, సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం ప్రయాణించడం విశేషం. నిన్ననే సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమైన సీఎం, తన కాన్వాయ్ కోసం రోడ్లపై ప్రజలను గంటల తరబడి నిలిపివేయవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు నేడు కొత్త విధానాన్ని అనుసరించారు. సీఎం వాహనాలు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా ఆపకుండా, వాహనాలను ఒకే లేన్‌లో కదలడానికి అనుమతిస్తూ సాధారణ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..