Reading Time: < 1 minute

సీఎం పదవికి రాజీనామా చేయను: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Caption of Image.

కోల్కత్తా: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. లోక్‌భవన్‌కు వెళ్లనని, గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇవ్వనని ఆమె కుండబద్ధలు కొట్టారు. టీఎంసీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోలేదని, తాము గెలిచామని.. తమ ఓట్లను చోరీ చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు.

అంతేకాదు.. ఎన్నికల సంఘంపై కూడా మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ పోరాటం బీజేపీతో కాదని, ఎన్నికల సంఘంతోనని ఆమె చెప్పారు. బీజేపీ ఈసీని ఉపయోగించుకుని ఈ వ్యూహ రచన చేసిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజాస్వామ్యం దారుణ హత్యకు గురైందని బెంగాల్ ఎన్నికల ఫలితాలపై దీదీ తీవ్రంగా స్పందించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

►ALSO READ | కడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి గెంటేశారు: మమత సంచలన ఆరోపణ

©️ VIL Media Pvt Ltd.