Reading Time: < 1 minute
Srikakulam Couple Murdered Over Witchcraft Allegations In Chinna Rajapuram

Srikakulam Couple Murder: శ్రీకాకుళం జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కొత్తూరు మండలం చిన్న రాజపురం గ్రామంలో చేతబడి నెపంతో భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మృతులను సవర ఎల్లంగి, సవర గయాని గా పోలీసులు గుర్తించారు. గ్రామంలో కొంతకాలంగా చేతబడి ఆరోపణల నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నట్లు సమాచారం. ఇదే వివాదం హత్యలకు దారితీసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలాగే సంఘటనా ప్రదేశంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటన అనంతరం నిందితులు పరారీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read Also: Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..