Reading Time: < 1 minute
Father Kills Two Sons And Dies By Suicide Mahabubabad Tragedy

Mahabubabad Tragedy: మహబూబాబాద్ జిల్లా పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తొర్రూర్ పట్టణ శివారులో అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై, తన ఇద్దరు కొడుకులను ఉరివేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే తొర్రూర్ సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు ముగ్గురూ ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులు తండి కిన్నెర గుమ్ షావలి (35), ఇద్దరు పిల్లలు విలాస్ (05) వికేష్ (03) గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్య కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.