Reading Time: 2 minutes
Iran War Is The World Preparing For The Biggest Lockdown Since Covid

Iran War: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ ఏర్పడుతోంది. ముఖ్యంగా, ఇజ్రాయిల్ అమెరికా దాడుల కారణంగా ఇరాన్ ఇంధన రవాణాకు చాలా కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో ఇప్పుడు బ్యారెల్ క్రూడాయిల్ ధర 112 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో గ్యాస్ ధర గ్యాలన్‌కు 5 డాలర్లు దాటాయి. దీంతో ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు తీవ్రంగా పెరుగుతున్నాయి.

ఇదే కాకుండా, ఇంధన సంక్షోభం కారణంగా విమాన సర్వీసులు కూడా తగ్గుతున్నాయి. దీంతో ప్రమాణ ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. పలు దేశాల ప్రభుత్వాలు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించాలని కోరుతున్నాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ వారంలోనే తన విమాన సర్వీసులలో 5% తగ్గించింది. ఇతర దేశాల్లోని విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను తగ్గిస్తున్నాయి. అవనసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలని ప్రభుత్వాలు కోరడం చూస్తే గతంలో కోవిడ్ ‘‘లాక్‌డౌన్’’ గుర్తుకు వస్తోంది.

Read Also: Dimona: ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..

ఇక చాలా దేశాలు ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌ను రేషన్ పద్ధతిలో ఇస్తున్నాయి. పాకిస్తాన్ వంటి దేశాలు ఇంధన సంక్షోభంతో గణతంత్ర వేడుకల్ని కూడా క్యాన్సల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. జపాన్‌లో చమురు రేషన్ అమలులోకి వచ్చింది. దక్షిణ కొరియా కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో పెట్రోల్‌ కోసం పొడవైన క్యూలు దర్శనమిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం తన ప్రజల్ని కోరుతోంది. భారతదేశానికి అవసరమయ్యే ముడి చమురులో 80 శాతం దిగుమతి అవుతోంది. గల్ఫ్ దేశాల నుంచి చమురు, ముఖ్యంగా ఖతార్ నుంచి ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో భారత చమురు అవసరాలు కూడా ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నాయి.

అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ‘ఆయిల్ షాక్‌ల నుండి రక్షణ’ అనే పేరుతో 10 సూత్రాల ప్రణాళికను విడుదల చేసింది. ఇది ప్రభుత్వాలకు సూచనలు చేసింది. వాహన వినియోగంపై నియంత్రణ, హైవేల్లో స్పీడ్ లిమిట్ తగ్గింపు, వర్క్ ఫ్రం హోమ్, గ్యాస్ బదులుగా ఎలక్ట్రిక్ వినియోగం వంటి సూచనలు చేసింది.