Reading Time: < 1 minute
T20 World Cup Semi Final India Practice Delayed Lunar Eclipse Wankhede

T20 World Cup Semi-final: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తున్నారు. మార్చి 5, గురువారం రోజు టీమిండియా ఇంగ్లాండ్‌ల మధ్య వాంఖడే స్టేడియం వేదిక కీలక పోరు జరగబోతోంది. ఈ సెమీస్‌లో గెలవాటని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదిలా ఉంటే గురువారం జరగబోయే మ్యాచ్‌ కోసం భారత్ ముమ్మర కసరత్తు చేస్తోంది.

Read Also: India Russia: నేనున్నాను మిత్రమా: సంక్షోభం వేళ భారత్‌కు రష్యా భరోసా..

అయితే, మంగళవారం చంద్ర గ్రహణం కారణంగా టీమిండియా తన ప్రాక్టీస్‌ను కొంత సమయం పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. భారత్‌కు మ్యాచ్ ముందు ప్రాక్టీస్ చేయడానికి మరో రెండు రోజులు మిగిలి ఉన్నాయి. మంగళవారం చంద్ర గ్రహణం కారణంగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రాక్టీస్ సెషన్ గంట పాటు వాయిదా పడింది. సాయంత్రం 6.47 గంటలకు ముందు ప్రాక్టీస్ చేయడం అశుభమని ప్లేయర్స్ భావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రపంచ కప్ సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆలయ సందర్శనలు సహా అనేక ఆచారాలను పాటిస్తున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ సహా కొంతమంది ఆటగాళ్ళు ప్రతి ప్రధాన నగరంలోని దేవాలయాలను సందర్శించారు.2024లో భారత్ సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్‌ లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. మరోసారి ఇదే రిపీట్ చేయాలని టీమిండియా, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.