
Instagram Reel Leads to Poisoning: సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై ఎక్కువగానే ఉందని చెప్పాలి.. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి వ్యక్తి.. కొన్ని రీల్స్ చేసేలా పరిస్థితి మారిపోయింది.. కొందరు వినోదం కూడిన రీల్స్ చేస్తే.. మరికొందరు తమకు తోచిన టిక్కాలు చెప్పేస్తున్నారు.. కొందరు వైద్యం తెలిసినవాళ్లు అయితే.. మరికొందరు ఎక్కడో విన్నవి కూడా రీల్స్ రూపంలో పెట్టేస్తున్నారు.. అయితే, ఉమ్మెత్తు పువ్వు తిన్న నలుగురి పరిస్థితి విషమం గా ఉంది.. సోషల్ మీడియా లో రీల్స్ చూసి సోమవారం పప్పు ఉమ్మెత్త పువ్వు కూర వండుకుని తిన్నారు ఓ కుటుంబ సభ్యులు.. మిగిలిన ఆకుకూరలు లానే ఉమ్మెత్త పువ్వు కూర బలమని వీడియో చూసి కూర వండుకుని తిన్నారు.. ఒకే కుటుంబానికి చెందిన గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి లు అస్వస్థతకి గురిఅయ్యారు.. వీరంతా హైదరాబాద్ లో ఉంటుండగా.. అమ్మవారి జాతర సందర్భంగా సొంత ఊరికి వచ్చారని చెబుతున్నారు స్థానికులు.. ఉమ్మెత్త పువ్వులో విషపూరిత పదార్థాలు ఉంటాయని, ప్రత్యేకంగా విరుగుడు ఉండదని, శరీరంలో పాయిజన్ పర్సంటేజ్ పెరిగితే ప్రాణాపాయం తప్పదని చెప్తున్నారు వైద్యులు.. కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు ఎర్రంపాలెం గ్రామానికి చెందిన బాధితులు..