
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీ ‘డెకాయిట్’ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. థియేటర్లలో రిలీజైనప్పటి నుంచి సాలిడ్ వసూళ్లతో దూసుకుపోయిన ఈ సినిమా, మూడు వారాల తర్వాత కూడా వీకెండ్స్లో మంచి బుకింగ్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అడివి శేష్ నటన, మృణాల్ గ్లామర్, భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్స్పై అలరించడానికి సిద్ధమైపోయింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం వచ్చే మే 8 నుంచి అన్ని పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ కాబోతోంది. దీనిపై అధికారికంగా అనౌన్స్మెంట్ రావాల్సి ఉన్నప్పటికీ, నెట్ఫ్లిక్స్లో ‘డెకాయిట్’ సందడి చేయడం పక్కా అని తెలుస్తోంది. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి ఈ యాక్షన్ థ్రిల్లర్ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్. సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో వచ్చిన ఈ విజువల్ వండర్ ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!