
PBKS vs RR: న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు మరోసారి వారి బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో మార్కస్ స్టోయినిస్ మెరుపు దాడితో రాజస్థాన్ బౌలర్లు విలవిలలాడారు.
పంజాబ్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు ధాటిగా ప్రారంభించారు. ప్రియాన్ష్ ఆర్య కేవలం 11 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 29 పరుగులు చేసి అవుట్ అవ్వగా, మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ బాధ్యతాయుతంగా ఆడాడు. ప్రభ్సిమ్రాన్ 44 బంతుల్లో 59 పరుగులు (6 ఫోర్లు, 1 సిక్సర్) చేసి జట్టుకు అవసరమైన పరుగులను అందించాడు. మధ్యలో కూపర్ కానోలీ (30), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30) తమ వంతు సహకారం అందించారు.
అయితే అసలైన వినోదం మార్కస్ స్టోయినిస్ బ్యాట్ నుండి మొదలైంది. క్రీజులోకి వచ్చిన క్షణం నుండే బౌండరీల వర్షం కురిపించిన స్టోయినిస్ కేవలం 22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ చివరి 5 ఓవర్లలో ఏకంగా 72 పరుగులు రాబట్టడం విశేషం. రాజస్థాన్ బౌలర్లు లో యాష్ రాజ్ పంజా 2 వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, నందరే బర్గర్ లు చెరో వికెట్ తీశారు.