Reading Time: 2 minutes
Husband Murdered His Wife By Administering Overdose Of Sedatives In Gurugram

ఇటీవలి కాలంలో ప్రేమ పెళ్లిళ్లు మూన్నాళ్లకే విషాదాంతంగా ముగుస్తున్నాయి. ఎంతో ఇష్టపడి ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఏడాదైనా గడవకముందే అంతమొందిస్తున్నారు. తాజాగా గురుగ్రామ్‌లోని గర్హి హర్సారు గ్రామంలో 23 ఏళ్ల నర్సు కాజల్ హత్య కేసు సంచలనంగా మారింది. ఆమె భర్త అరుణ్ శర్మ, అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గురుగ్రామ్ పోలీసులు నిందితుడైన భర్తను అరెస్టు చేసి, కేసును పూర్తిగా ఛేదించారు. ఈ జంటకు నాలుగు నెలల క్రితం, 2025 నవంబర్‌లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత, అరుణ్ వరకట్నం కోసం కాజల్‌ను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Also Read:Luxurious Bicycles: లక్షలు కాదు.. కోట్లు.. అత్యంత ఎక్స్‌పెన్సివ్ 5 సైకిల్స్ ఏవో తెలుసా? బంగారం, వజ్రాలతో తయారీ

నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని బహతా హజీపూర్ గ్రామానికి చెందిన అరుణ్ శర్మ (26)గా గుర్తించారు. అతని కుటుంబం ప్రస్తుతం ఢిల్లీలోని అశోక్ నగర్ షాదారాలో నివసిస్తోంది. నిందితుడు అరుణ్ శర్మను విచారించగా, అతను 12వ తరగతి ఉత్తీర్ణుడని, గురుగ్రామ్‌లోని ఒక నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్నాడని వెల్లడైంది. అతను మాదకద్రవ్యాలకు కూడా బానిస. మృతురాలైన కాజల్ కూడా నర్సుగా పనిచేసేదని, కలిసి పనిచేస్తున్నప్పుడు తాము స్నేహితులయ్యామని నిందితుడు అరుణ్ శర్మ తెలిపాడు. ఆ తర్వాత, వారి కుటుంబాల అంగీకారంతో 2025 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు.

అరుణ్ శర్మను విచారించగా, పెళ్లికి ముందు వారిద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉండేదని వెల్లడైంది. అయితే, పెళ్లి తర్వాత చిన్న చిన్న విషయాలకే గొడవపడటం మొదలుపెట్టారని, చాలాసార్లు ఒకరినొకరు కొట్టుకున్నారని తెలిసింది. మార్చి 18న తన భార్య కాజల్‌కు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే ఆమె మరణించిందని నిందితుడు వెల్లడించాడు. మృతురాలి సోదరుడు గుర్దీప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, అరుణ్ శర్మ తన సోదరి కాజల్‌ ను కట్నం కోసం వేధించాడని ఆరోపించాడు.

Also Read:Aishwarya Lekshmi: పెళ్లి కంటే అదే బెటర్.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్!

పెళ్లి సమయంలో తగినంత కట్నం ఇవ్వలేదని ఆమెను ఎగతాళి కూడా చేశాడని తెలిపాడు. మృతురాలి సోదరుడు గుర్దీప్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, వరకట్నం మరణానికి సంబంధించి నిందితుడు అరుణ్ శర్మపై సెక్టార్ 10 పోలీస్ స్టేషన్‌లో CrPC సెక్షన్ 80(2) కింద FIR నమోదు చేశారు. నిందితుడు అరుణ్ శర్మను శనివారం కోర్టులో హాజరుపరిచి, మూడు రోజుల రిమాండ్‌కు తీసుకున్నట్లు దర్యాప్తు అధికారి ఏఎస్ఐ జగదీష్ చంద్ర తెలిపారు.